డిస్కమ్‌లలో ఆర్టిజన్ల బదిలీలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-04-09T10:01:27+05:30 IST

డిస్కమ్‌లలో ఆర్టిజన్ల బదిలీలకు కరోనాతో బ్రేక్‌ పడింది. ప్రధానంగా ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఆర్టిజన్లను బదిలీ చేయాలని, ఇందుకుగాను మార్గదర్శకాలు రూపొందించాలని ఇప్పటికే కమిటీ వేశారు. సంఘాలతో గురువారం

డిస్కమ్‌లలో ఆర్టిజన్ల బదిలీలకు బ్రేక్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌లలో ఆర్టిజన్ల బదిలీలకు కరోనాతో బ్రేక్‌ పడింది. ప్రధానంగా ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఆర్టిజన్లను బదిలీ చేయాలని, ఇందుకుగాను మార్గదర్శకాలు రూపొందించాలని ఇప్పటికే కమిటీ వేశారు. సంఘాలతో గురువారం ఈ కమిటీ సమావేశం కూడా జరగాల్సి ఉం ది. అయితే కరోనా నేపథ్యంలో బదిలీలు వద్దని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం వాయిదా వేశారు. ఎస్పీడీసీఎల్‌లో రూపొందించే మార్గదర్శకాలను  మిగిలిన విద్యుత్‌ సంస్థలు అన్వయం చేసుకొని ఆర్టిజన్లను ట్రాన్స్‌ఫర్‌ చేస్తాయి.

Updated Date - 2020-04-09T10:01:27+05:30 IST