వీడెక్కడి లవర్ బాబోయ్.. ప్రేమించిన అమ్మాయికి పెళ్లని తెలిసి..

ABN , First Publish Date - 2021-01-11T01:59:08+05:30 IST

ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకాలోని ఆవర్సా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రామనగుళి నివాసి నందాగాష్కర్ కుమార్తె దివ్యకు...

వీడెక్కడి లవర్ బాబోయ్.. ప్రేమించిన అమ్మాయికి పెళ్లని తెలిసి..

మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువును టార్గెట్ చేస్తూ కాల్పులు.. భగ్నప్రేమికుడి దుర్మార్గం

బెంగళూరు: మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే వధువును టార్గెట్ చేస్తూ బస చేసిన గది కిటికీ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకాలోని ఆవర్సా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రామనగుళి నివాసి నందాగాష్కర్ కుమార్తె దివ్యకు ఖేణి గ్రామానికి చెందిన ప్రకాశ్‌తో శనివారం ఉదయం పెళ్లి నిర్ణయించారు. గ్రామంలోని ఓ ప్రైవేటు భవనంలో వివాహం జరగాల్సి ఉంది. వధువు దివ్య సమీప బంధువుల ఇంట బస చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆమె ఉండే గది వద్ద పెద్దగా కాల్పుల మోత వినిపించింది. ఓ వైపు చలి, మరోవైపు అప్పుడప్పుడే పెళ్లి సందడి మొదలైంది. బంధువులు శబ్దం వచ్చిన చోటుకు పరుగులు తీశారు.


ఎవరూ కనిపించకపోగా కిటికీకి కిందిభాగాన మూడుచోట్ల బుల్లెట్లు తగిలి ఉండటాన్ని గుర్తించారు. వెనువెంటనే అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే ప్రాంతానికి చెందిన రాజేష్ గణపతి గావ్కర్ అనే వ్యక్తి దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. కొంతకాలంగా దివ్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బలవంతపెట్టాడు. అయితే దివ్య అంగీకరించకపోవడంతో పెళ్లి రోజు దారుణానికి పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసుల బందోబస్తుతో పెళ్లి జరిపారు. రాజేశ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉండగా మరో కేసు నమోదు చేసినట్లు అంకోలా పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-01-11T01:59:08+05:30 IST