పెళ్లయిన పదో రోజే నవ వధువుకు కడుపునొప్పి.. డాక్టర్ వచ్చి పరిశీలించి చెప్పిన నిజం విని ఆ భర్తకు మైండ్‌బ్లాక్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-02T22:20:43+05:30 IST

కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో మేళతాళాల మధ్య ఆ యువకుడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఏడు అడుగులు నడిచి.. తన ఇంట్లో అడుగుపెట్టిన ఆమెను అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాడు. ఈ

పెళ్లయిన పదో రోజే నవ వధువుకు కడుపునొప్పి.. డాక్టర్ వచ్చి పరిశీలించి చెప్పిన నిజం విని ఆ భర్తకు మైండ్‌బ్లాక్.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో మేళతాళాల మధ్య ఆ యువకుడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఏడు అడుగులు నడిచి.. తన ఇంట్లో అడుగుపెట్టిన ఆమెను అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి తర్వాత సరిగ్గా పది రోజులకే ఆ యువతి తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. దీంతో వైద్య పరీక్షలు చేయించగా.. ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడికి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది. విహహానంతరం ఆ నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో దాదాపు 10 రోజులు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ నవవధువు ఉన్నట్టుండి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. దీంతో కంగారుపడ్డ ఆమె భర్త.. వైద్యుడిని ఇంటికి పిలిపించాడు. కాగా.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్.. పిడుగులాంటి వార్తను చెప్పాడు. ఆ నవవధువు 8నెలల గర్భవతి అని తేల్చేశారు. ఈ మాటలు విన్న ఆ వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు.. విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వధువు కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేరొకరిని ప్రేమించి.. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా.. వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-10-02T22:20:43+05:30 IST