పెళ్లైన 20 రోజులకు భర్త గురించి షాకింగ్ విషయం విన్న నవవధువు.. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-02T00:13:29+05:30 IST

న్నో ఆశలతో పెళ్లి చేసుకుని, భర్తతో కలిసి ఆనందంగా అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు. అప్పుడప్పుడే ఇంట్లో వాళ్లని అర్థం చేసుకుంటూ.. కలివిడిగా ఉంటోంది. ఈ క్రమంలో 20 రోజులు గడిచిపోయాయి. ఇంతో భర్తకు సంబంధించిన షాకింగ్ విషయం ఒక

పెళ్లైన 20 రోజులకు భర్త గురించి షాకింగ్ విషయం విన్న నవవధువు.. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని, భర్తతో కలిసి ఆనందంగా అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు. అప్పుడప్పుడే ఇంట్లో వాళ్లని అర్థం చేసుకుంటూ.. కలివిడిగా ఉంటోంది. ఈ క్రమంలో 20 రోజులు గడిచిపోయాయి. ఇంతో భర్తకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి ఆ నవవధువు చెవిలో పడింది. దీంతో ఆమె విస్తుపోయింది. తన భర్త తనను మోసం చేశాండంటూ కన్నీటిపర్యంతం అయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన ఓ యువతికి ఆమె కుటుంబ సభ్యులు అదే జిల్లాకు చెందిన జవానారామ్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుని.. ఆ నవవధువు భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో సుమారు 20 రోజులు గడిచిపోయాయి. తాజాగా ఆ నవవధువుకు ఓ ఫోన్ వొచ్చింది. అవతలి వాళ్లు చెప్పింది విని.. ఆమె ఒక్కసారిగా షాకైంది. తన భర్తకు ఇది వరకే పెళ్లైందని, ఓ బిడ్డ కూడా ఉన్నాడని తెలిసి విస్తుపోయింది. దీంతో జవానారామ్‌ను పట్టుకుని నిలదీసింది. అతడు సమాధానం చెప్పకపోగా.. ఆ నవవధువును ఇంట్లోంచి గెంటేశాడు. ఈ నేపథ్యంలో ఆమె.. కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, భర్తపై ఫిర్యాదు చేసింది. మొదటి పెళ్లి విషయాన్ని దాచి రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తన నగలను లాక్కుని ఇంటి నుంచి గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కాగా.. ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 




Updated Date - 2022-01-02T00:13:29+05:30 IST