పెట్రోల్ బంక్ వద్ద టెన్షన్ టెన్షన్ గా కనిపించిన యువతి.. పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే..

ABN , First Publish Date - 2021-10-19T11:22:48+05:30 IST

రాజస్థాన్‌లోని ఘున్‌ఘును నగరంలో పెళ్లైన పదిరోజులకే ఒక పెళ్లికూతురు తన అత్తారిల్లు వదిలి పారిపోయింది. కారణం తెలిసి పోలీసులు ఒక్కసారిగా షాక్కయ్యారు. అసలేం జరిగిందంటే..

పెట్రోల్ బంక్ వద్ద టెన్షన్ టెన్షన్ గా కనిపించిన యువతి.. పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే..

రాజస్థాన్‌లోని ఘున్‌ఘును నగరంలో పెళ్లైన పదిరోజులకే ఒక పెళ్లికూతురు తన అత్తారిల్లు వదిలి పారిపోయింది. కారణం తెలిసి పోలీసులు ఒక్కసారిగా షాక్కయ్యారు. అసలేం జరిగిందంటే..


ఘున్‌ఘును నగరంలోని ఉదయ్‌పుర్ వాటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో కొత్తగా పెళ్లి చేసి తెచ్చుకున్న కోడలు తన అత్తారింట్లో ఉండే సభ్యులందిరికీ భోజనంలో మత్తు కలిపి ఇచ్చింది. వారంతా అపస్మారక స్థితిలో ఉండగా అక్కడి నుంచి పారిపోయింది. ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూడగా ఆ ఇంట్లోని నలుగురు సభ్యులు అపస్మారక స్థితిలో కింద పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 


పోలీసులు ఆ అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబసభ్యులని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని జైపూర్‌లో మరో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారు. అలా పోలీసులు వారందరినీ జైపూర్ ఆస్పత్రికి చేర్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆ కుటుంబసభ్యులలో ఒకరికి స్పృహ వచ్చి పోలీసులకు జరిగిన సంఘటన గురించి చెప్పాడు. తమ ఇంట్లో పది రోజుల కిందటే పెళ్లి జరిగిందని.. వచ్చిన నవవధువు నిన్న రాత్రి భోజనంలో ఏదో కలిపిందని చెప్పాడు. ఆ తరువాత తాను స్పృహ కోల్పోయానని అన్నాడు. ప్రస్తుతం ఆ నవవధువు ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు తెలిసింది.


పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా జైపూర్‌లోని ఒక పెట్రోల్ పంపు వద్ద ఒక బ్యాగు తీసుకొని ఒక 25 ఏళ్ల యువతి కనిపించింది. ఆ యువతి తాము వెతుకుతున్న మిస్సింగ్ పెళ్లికూతురి పోలికలు ఉండడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆమె బ్యాగుని పరిశీలించారు.  అందులో కేవలం బట్టలు మాత్రమే ఉన్నాయి. ఆమెను ప్రశ్నించగా.. తన పేరు సవిత అని చెప్పింది. బిహార్‌లోని ఛాప్రాలో తన తల్లిదండ్రులు ఉంటారని, అక్కడి నుంచి పది రోజుల క్రితమే తనకు పెళ్లిచేసుకొని రాజస్థాన్ తీసుకొచ్చారని తెలిపింది. 


పోలీసులు ఆమె అత్తవారు చెప్పినట్లు భోజనంలో ఎందుకు మత్తు కలిపిందో చెప్పమని గట్టిగా అడిగారు. అందుకు సవిత చెప్పిన సమాధానం విని వారు విస్తుపోయారు. తనే వారి భోజునంలో మత్తు కలిపినట్లు ఆమె అంగీకరించింది. తన తల్లిందండ్లులు బాగా పేదవారని, అందువల్ల తనని వారు రాజస్థాన్ వారికి అమ్మేశారని చెప్పింది. కానీ అత్తారింటికి వచ్చాక తన భర్త తాగుబోతని, రోజూ చిత్రహింసలు పెట్టేవాడని అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చానని చెప్పింది.


పోలీసులు నిజనిజాలు తెలుసుకునేందుకు బిహార్‌లోని సవిత తల్లిదండ్రులకు కబురు పంపారు. ఆ తరువాత సవిత భర్త కుటుంబమంతా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక వారిని సవితపై కేసు పెట్టమని పోలీసులు అడిగారు. కానీ అందుకు వారు అంగీకరించలేదు. ఒకవేళ కేసు పెడితే వారు సవితని డబ్బులిచ్చి బీహార్ నుంచి తీసుకొచ్చారనే విషయం బయటపడుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సవిత తన తల్లిదండ్రులతో బీహార్ వెళ్లిపోయింది.

Updated Date - 2021-10-19T11:22:48+05:30 IST