శోభనం గదిలో పూలతో పూర్తిగా అలంకరించిన బెడ్‌ను చూసి వధువు అడిగిన ప్రశ్నతో నవ్వులే నవ్వులు..!

ABN , First Publish Date - 2021-07-31T00:20:40+05:30 IST

భారత్‌లో పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతాయో తెలిసిందే. జీవితంలో ఒకేసారి జరిగే ఈ వేడుకను గుర్తుండిపోయేలా జరుపుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు.

శోభనం గదిలో పూలతో పూర్తిగా అలంకరించిన బెడ్‌ను చూసి వధువు అడిగిన ప్రశ్నతో నవ్వులే నవ్వులు..!

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతాయో తెలిసిందే. జీవితంలో ఒకేసారి జరిగే ఈ వేడుకను గుర్తుండిపోయేలా జరుపుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. దీనికోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. వీటిలో బాగా ఖర్చయ్యే అంశాల్లో వధూవరుల బెడ్రూం కూడా ఒకటి. ఇదిగో ఇప్పుడు ఇలా కొత్తగా పెళ్లయిన ఒక జంట బెడ్రూం గొడవ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందంటే.. కొత్తగా పెళ్లయిన వధువును తొలిరాత్రి బెడ్రూంలోకి పంపించారు. అప్పటికే ఆ బెడ్రూంను పూలతో నింపేశారు వివాహ నిర్వాహకులు. పెళ్లి కొడుకు చాలా కష్టపడి బెడ్ మొత్తాన్ని పూల పరుపులా మార్పించాడు. ఇదంతా చూసిన వధువు సూటిగా ఒక్క ప్రశ్న అడిగింది. అంతే ముందు అందరూ ఆశ్చర్యపోయారు, ఆ తర్వాత నవ్వలేక చచ్చారు. ఇంతకీ ఆ వధువు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా?.. ‘ఎక్కడ పడుకోవాలి?’


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఈ వధువు అమాయకంగా అడిగిన ప్రశ్న విన్న కుటుంబీకులంతా పగలబడి నవ్వేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతోంది. ఇప్పటికే దీనికి పదిలక్షలపైగా వ్యూస్ లభించగా, 53వేలపైగా లైకులు కూడా వచ్చాయి. ఈ వీడియో చివర్లో అదే గదిలో ఒక మూల నిలబడి ఉన్న వరుడు పెళ్లి కూతురి ప్రశ్నకు నీరుగారిపోయి ‘‘ఆమెకు నా కష్టం కనిపించడం లేదు’’ అని బాధపడుతుండటం కొసమెరుపు. ఆ వరుడి బాధ ఈ వీడియోకి సరిగ్గా సూటయ్యే ఎండింగ్ ఇచ్చింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఆమె ప్రశ్న కరెక్టే. నిద్ర కూడా చాలా ముఖ్యం’ అంటుండగా.. మరికొందరేమో పెళ్లి కొడుకు బాధను పంచుకుంటూ.. ‘‘నీ ప్రయత్నం, నీ బాధ నాకు అర్థమయ్యాయి. కానీ నవ్వు మాత్రం ఆగడం లేదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2021-07-31T00:20:40+05:30 IST