పెళ్లైన 28 రోజులకే కడుపు నొప్పంటూ ఆసుపత్రికి వెళ్లి.. ఎంతకీ తిరిగిరాని భార్య.. అసలు విషయం తెలిసి అతడి మైండ్ బ్లాక్!

ABN , First Publish Date - 2022-01-19T22:12:18+05:30 IST

వారిద్దరి పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన 28 రోజులకే భార్యకు సడన్‌గా కడుపు నొప్పి వచ్చింది. చికిత్స

పెళ్లైన 28 రోజులకే కడుపు నొప్పంటూ ఆసుపత్రికి వెళ్లి.. ఎంతకీ తిరిగిరాని భార్య.. అసలు విషయం తెలిసి అతడి మైండ్ బ్లాక్!

రాజస్థాన్: వారిద్దరి పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన 28 రోజులకే భార్యకు సడన్‌గా కడుపు నొప్పి వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నట్లు భర్తతో చెప్పి ఆమె బయల్దేరింది. ఆసుపత్రికి వెళ్లిన భార్య ఎంతకీ తిరిగిరాకపోవడంతో భర్త ఆమెకోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగుతిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని సిరోహి ప్రాంతానికి చెందిన ఉత్తమ్ సింగ్‌కు రేణుక కున్వర్‌తో నవంబర్ 25న వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి రేణుక భర్తతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే పెళ్లైన 28 రోజులకే రేణుక తనకు కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్తానని భర్తతో చెప్పింది. ఉత్తమ్‌కు వేరే ముఖ్యమైన పని ఉండడం వల్ల భార్యతో వెళ్లడానికి అతనికి కుదరలేదు. దీంతో ఆసుపత్రి ఖర్చుల కోసం ఆమెకు కొంత డబ్బు ఇచ్చి పంపాడు. అయితే ఆసుపత్రికి వెళ్లిన భార్య ఎలా ఉందోనని కొంత సమయం తర్వాత అతడు రేణుకకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మరి కొద్దిసేపటికి మళ్లీ ప్రయత్నించాడు. అయినా ఆమె ఫోన్ కలవలేదు.


అలా సాయంత్రం వరకు ఎదురుచూసి ఆ తర్వాత భార్య కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. వారు కూడా స్పందించకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. పెళ్లి కుదిర్చిన దళాల్ మహేంద్రసింగ్‌ ఫోన్ కూడా కలవకపోవడంతో అతడి అనుమానం మరింత బలపడింది. చివరికి అసలు విషయం తెలిసి ఉత్తమ్ సింగ్ కంగుతిన్నాడు. భార్య ఇంట్లోంచి వెళ్తూ 30 వేల నగదు తీసుకెళ్లిందని.. అంతే కాకుండా పెళ్లి కుదిర్చిన దళాల్ కూడా తనని మోసం చేశాడని గ్రహించి లబోదిబోమన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. 5లక్షల నగదు తీసుకుని పెళ్లి సంబంధం కుదిర్చిన దళాల్ మహేంద్రసింగ్ మీద, 30వేల నగదుతో ఇంట్లోంచి పరారైన భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఉత్తమ్ సింగ్ బుధవారం ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయమని కోరాడు.

Updated Date - 2022-01-19T22:12:18+05:30 IST