పెళ్లైన 15 రోజులకే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆమె కోసం వెళ్లిన భర్తకు అత్తింటి వారు ఇచ్చిన షాక్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-21T16:42:34+05:30 IST

ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి వివాహం జరగడం లేదు.. దీంతో అతను మధ్యవర్తులను ఆశ్రయించాడు..

పెళ్లైన 15 రోజులకే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆమె కోసం వెళ్లిన భర్తకు అత్తింటి వారు ఇచ్చిన షాక్ ఏంటంటే..

ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి వివాహం జరగడం లేదు.. దీంతో అతను మధ్యవర్తులను ఆశ్రయించాడు.. రూ.2 లక్షలు ఎదురు కట్నం ఇస్తే ఆమ్మాయిని చూస్తామని వారు చెప్పారు.. వారు చెప్పినదానికి అంగీకరించడంతో అతనికి పెళ్లి కుదిరింది.. రూ.2 లక్షలు మధ్యవర్తులకు ఇచ్చేశాడు.. పెళ్లి జరిగిన పదిహేను రోజులకే ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.. మళ్లీ తిరిగి రాలేదు.. దీంతో ఆమె కోసం వెళ్లిన భర్తకు అత్తింటి వారు షాక్ ఇచ్చారు.. రూ.1.50 లక్షలు ఇస్తేనే కాపురానికి పంపిస్తామన్నారు.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జైపూర్‌కు సమీపంలో భట్టా బస్తీకి చెందిన రాజేంద్రకు 40 ఏళ్లు వచ్చినా వివాహం కాలేదు. దీంతో అతను మ్యారేజ్ బ్రోకర్ల దగ్గరకు వెళ్లాడు. వారు రూ.2 లక్షలు ఎదురు కట్నం ఇస్తే పెళ్లి చేస్తామని చెప్పారు. అందుకు రాజేంద్ర అంగీకరించడంతో వారు రుక్సానా అనే యువతితో పెళ్లి పిక్స్ చేశారు. దీంతో రాజేంద్ర వారికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. రుక్సానాను నవంబర్ 20న వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన పదిహేను రోజులకు ఈ నెల 5వ తేదీన రుక్సానా తన పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో భార్య కోసం రాజేంద్ర ఆమె పుట్టింటికి వెళ్లాడు. 


రుక్సానాను కాపురానికి పంపించమని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. పెళ్లి సమయంలో తమకు రూ.2 లక్షలు ఎదురు కట్నం ఇస్తామన్నారని, కానీ రూ.50 వేలే ఇచ్చారని, మిగిలిన రూ.1.50 లక్షలు ఇస్తేనే రుక్సానాను కాపురానికి పంపిస్తామని ఆమె తల్లి చెప్పింది. నెల రోజుల్లో రూ.1.50 లక్షలు ఇవ్వకపోతే రుక్సానాకు మరో పెళ్లి చేస్తానని తెగేసి చెప్పింది. దీంతో షాకైన రాజేంద్ర మధ్యవర్తులపై, రుక్సానా కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2021-12-21T16:42:34+05:30 IST