వింత కారణంతో ఆగిపోయిన పెళ్లి!

ABN , First Publish Date - 2021-05-11T21:23:28+05:30 IST

వరుడు రెండో ఎక్కం చెప్పలేదనే కారణంతో పెళ్లికి నిరాకరించింది ఓ యువతి.

వింత కారణంతో ఆగిపోయిన పెళ్లి!

వరుడు రెండో ఎక్కం చెప్పలేదనే కారణంతో పెళ్లికి నిరాకరించింది ఓ యువతి. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహోబాకు చెందిన రంజిత్ అహర్వార్‌తో మాయకు వివాహం నిశ్చయమైంది. ఇరు కుటంబాల పెద్దలూ పెళ్లి రోజున వేదిక వద్దకు చేరుకున్నారు. 


మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగబోతోందనగా వరుడు రంజిత్ ప్రవర్తన చూసి మాయకు అనుమానం వచ్చింది. రెండో ఎక్కం చెప్పమని అడిగింది. అయితే రంజిత్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కనీసం రెండో ఎక్కం కూడా రాని వ్యక్తిని పెళ్లి చేసుకునేది లేదని చెప్పి మాయ వివాహ వేదిక నుంచి వెళ్లిపోయింది. అంతే కాదు వివాహ ఏర్పాటుకు అయిన ఖర్చు మొత్తం వరుడి కుటుంబం తిరిగి చెల్లించాలని పోలీసులను ఆశ్రయించింది. 


Updated Date - 2021-05-11T21:23:28+05:30 IST