ప్రియురాలి బెదిరింపుతో వరుడు పరార్... కండక్టర్‌ను పెళ్లి చేసుకున్నవధువు!

ABN , First Publish Date - 2021-01-07T17:29:16+05:30 IST

కల్యాణ మండపం నుంచి వధువు మాయమయ్యిందనే వార్తలు అప్పుడప్పుడూ వింటుంటాం. అయితే...

ప్రియురాలి బెదిరింపుతో వరుడు పరార్... కండక్టర్‌ను పెళ్లి చేసుకున్నవధువు!

చిక్‌మంగళూరు: కల్యాణ మండపం నుంచి వధువు మాయమయ్యిందనే వార్తలు అప్పుడప్పుడూ వింటుంటాం. అయితే వరుడు మాయమయ్యాడనే వార్తలు అంతగా వినివుండం. అయితే ఇటువంటి ఘటన కర్నాటకలోని చిక్‌మంగళూరులో వెలుగు చూసింది. ఒక వరుడు కల్యాణ మండపం నుంచి పరారయ్యాడు. ఆ తరువాత ఎవరూ ఊహించని వాతావరణం అక్కడ ఏర్పడింది. కల్యాణమండపం నుంచి వరుడు పరారయ్యాడని తెలుసుకున్న వధువు పెళ్లికి హాజరైన ఒక యువకుడిని వివాహం చేసుకుంది. ఈ ఉదంతం తిరికరె తాలూకాలోని ఒక గ్రామంలో జరిగింది.


అశోక్, నవీన్ అనే సోదరులకు కొద్దిసేపట్లో వివాహం జరగనుంది. నవీన్ అతని కాబోయే భార్య సింధుకు పెళ్లికి ముందు జరిగే తంతు పూర్తయ్యింది. అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నంతలో నవీన్ మాయమయ్యాడు. అతని ప్రియురాలు ఈ పెళ్లి చేసుకుంటే విషం తాగుతానని బెదిరించడంతో నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడని బంధువులు చెబుతున్నారు. కాగా నవీన్ సోదరుడు అశోక్ వివాహం సవ్యంగానే సాగింది. అయితే సింధు‌కు వివాహం కాకపోవడంతో ఆమె  కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. తరువాత వారు ఒక నిర్ణయానికి వచ్చి వివాహానికి వచ్చిన బీఎంటీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న చంద్రప్పతో సింధుకు వివాహం చేయాలని నిర్ణయించారు. అందుకు చంద్రప్ప కూడా సమ్మతి తెలిపాడు. దీంతో సింధూచంద్రప్పల వివాహం అదే కల్యాణవేదికపై జరిగింది. 

Updated Date - 2021-01-07T17:29:16+05:30 IST