వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:08:33+05:30 IST

వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలి

వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలి
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని, చిత్రంలో మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌, జనవరి 22 : ఘట్‌కేసర్‌లోని కొండాపూర్‌ రైల్వేగేట్‌ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్యయాదవ్‌ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి మల్లారెడ్డితో కలిసి నగరంలోని ప్రశాంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని కొండాపూర్‌ రైల్వేగేట్‌ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మంత్రి సంబంధిత అధికారులను పిలిపించి సమస్యను అడిగి తెలుసుకుని, పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు చైర్‌పర్సన్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-29T05:08:33+05:30 IST