తమ్ముడిని చున్నీతో ఉరివేసి చంపిన అన్న

ABN , First Publish Date - 2020-05-27T14:16:34+05:30 IST

అంబర్‌పేట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది.

తమ్ముడిని చున్నీతో ఉరివేసి చంపిన అన్న

హైదరాబాద్/అంబర్‌పేట : అంబర్‌పేట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో సొంత అన్న తనతమ్ముడిని ఉరివేసి చంపేశాడు. ఇన్‌స్పెక్టర్‌ బిట్టు మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌లో నివాసం ఉండే మహ్మద్‌ సర్దార్‌కు నలుగురు కుమారులున్నారు. మొదటి కుమారుడు షాహిద్‌ ప్రైవేటు ఉద్యోగి. చిన్న కుమారుడు మునావర్‌ కారు డ్రైవర్‌. మునావర్‌కు దాదాపు పదేళ్ల కిందట కల్పనతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. 


మునావర్‌ మద్యానికి బానిస కావడంతో ఆమె రెండేళ్ళకిందట తన పిల్లలతో సహా అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో మునావర్‌ రోజూ మద్యం తాగొచ్చి.. కుటుంబసభ్యులను వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా మునావర్‌ మద్యం తాగి సోదరుడు షాహిద్‌తో గొడవపడ్డాడు. ఆగ్రహం చెందిన షాహిద్‌ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మునావర్‌ను చున్నీతో ఉరివేసి హత్యచేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. నిందితుడు షాహిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-05-27T14:16:34+05:30 IST