ఉప్పుటేరులోకి దిగి అన్నదమ్ములు మృతి
ABN , First Publish Date - 2021-10-27T01:08:59+05:30 IST
విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడలో
విజయనగరం: విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడలో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొల్పింది. స్థానికంగా ఉండే ఉప్పుటేరులో స్నానానికి దిగిన అన్నదమ్ములు ఊబిలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందారు. ఇద్దరు ఒక కన్నతల్లి బిడ్డలు కావటంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు.. విషయం తెలుసుకున్న పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను ఆనంద్ 9వ తరగతి, హరీష్ ఇంటర్ విద్యార్థిగా గుర్తించారు. ఇద్దరి అన్నదమ్ముల మృతితో కోనాడా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.