రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలిపై అన్నల దాడి
ABN , First Publish Date - 2020-08-04T10:41:09+05:30 IST
రక్షాబంధన్ రోజునే చెల్లెలిపై అన్నలు, వదిన దాడిచేశారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
హిందూపురం టౌన్, ఆగస్టు 3 : రక్షాబంధన్ రోజునే చెల్లెలిపై అన్నలు, వదిన దాడిచేశారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు భారతమ్మ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. హిందూపురం మండలం వీవర్స్కాలనీలో నివాసమున్న అన్నయ్యలు శివప్ప, హనుమంతరాయప్పకు రాఖీ కట్టడానికి వెళ్లానని, అయితే గతంలో ఉన్న విబేధాలతో వారు తనపై కర్రలతో దాడిచేశారని, దీంతో కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయని వాపోయింది. వెంటనే భర్తకు సమాచారం ఇచ్చి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నానన్నారు. కొన్నేళ్లక్రితం వారి వద్ద ఉన్న తన బంగారం సొమ్ములను అడిగినందుకే నానాదుర్భాషలాడి దాడిచేసినట్లు ఆమె చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.