యమునలో ఈతకెళ్లి.. అన్నదమ్ముల మృతి!

ABN , First Publish Date - 2020-08-05T03:50:57+05:30 IST

యమునా నదిలో ఈత కొట్టడం కోసం వెళ్లిన ఇద్దరు సోదరులు మృతిచెందారు.

యమునలో ఈతకెళ్లి.. అన్నదమ్ముల మృతి!

ఢిల్లీ: యమునా నదిలో ఈత కొట్టడం కోసం వెళ్లిన ఇద్దరు సోదరులు మృతిచెందారు. వీరితోపాటు వెళ్లిన ఓ మిత్రుడు మాత్రం ప్రాణాలు కాపాడుకోగలిగాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అజయ్(23), కరణ్(19) ఇద్దరూ అన్నదమ్ములు. వీరు రాకేష్ అనే స్నేహితుడితో కలిసి యమునా నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో రాకేష్, కరణ్ ఇద్దరూ నీటిలో మునిగిపోవడం మొదలెట్టారు. దీంతో అటుగా వచ్చిన ఓ పడవలోని వ్యక్తి వీరిని కాపాడటం కోసం తాడు విసిరాడు. దాన్ని పట్టుకొని ముందుగా అజయ్ పడవ ఎక్కాడు. ఆ తర్వాత రాకేష్ తాడందుకున్నాడు. కానీ కరణ్ తాడు కూడా పట్టుకోలేకపోయాడు. దీంతో తమ్ముడిని కాపాడటం కోసం అజయ్ నీళ్లలో దూకాడు. కానీ ఇద్దరూ నీట మునిగి కన్నుమూశారు. ఈ ఘటన ఢిల్లీలోని కొత్వాలీ సమీపంలో జరిగింది.

Updated Date - 2020-08-05T03:50:57+05:30 IST