HYD : దావూద్‌బస్తీలో దారుణం.. నడి బజారులో కత్తితో పొడిచి...!

ABN , First Publish Date - 2021-11-26T15:40:52+05:30 IST

నెలరోజుల క్రితం జైలునుంచి విడుదలై వచ్చాడు. నెహ్రూనగర్‌కు...

HYD : దావూద్‌బస్తీలో దారుణం.. నడి బజారులో కత్తితో పొడిచి...!

  • జైలునుంచి విడుదలై నెలరోజులే..  


హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : జగద్గిరిగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని దావూద్‌బస్తీలో ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వేటాడి విచక్షణా రహితంగా కడుపులో పొడిచి పారిపోయారు. మృతుడు ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడి. నెలరోజుల క్రితం జైలునుంచి విడుదలై వచ్చాడు. నెహ్రూనగర్‌కు చెందిన శివరాం కుమారుడు గైక్వాడ్‌ శ్రీహరి అలియాస్‌ మహ్మద్‌ ఉస్మాన్‌ (30) గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం దావూద్‌బస్తీకి చెందిన జావెద్‌ అనేవ్యక్తిని ఉస్మాన్‌ దారుణంగా హత్యచేసి జైలుజీవితం గడిపాడు. 


నెలరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన ఉస్మాన్‌ స్థానికంగా ఉన్న ఓ స్థల వివాదంలో తలదూర్చాడు. అంతేకాక కుటుంబలో కలహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉస్మాన్‌ను దావూద్‌బస్తీలో నడిరోడ్డుపై కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ హత్యలో దావూద్‌బస్తీకి చెందిన ముస్తాఫా ప్రమేయం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ కె.సైదులు శవాన్ని పరిశీలించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-26T15:40:52+05:30 IST