రైల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ సెల్‌ఫోన్‌ చోరీ

ABN , First Publish Date - 2021-04-05T13:03:36+05:30 IST

రైలులో ప్రయాణిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బ్యాగులోని ఖరీదైన

రైల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ సెల్‌ఫోన్‌ చోరీ

హైదరాబాద్/బర్కత్‌పుర : రైలులో ప్రయాణిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బ్యాగులోని ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగలు తస్కరించారు. కాచిగూడ రైల్వే పీఎస్‌ హేడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణచారి తెలిపిన వివరాల ప్రకారం... రఘువీర్‌సింగ్‌ ఒడిశాలోని బీఎస్‌ఎఫ్‌‌లో జవాన్‌. తమిళనాడులో ఎన్నికలను పురస్కరించుకుని అక్కడ విధులు నిర్వహించడానికి వెళ్లాడు. ఒడిశా వెళ్లడానికి చెంగల్పటు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. గద్వాల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రఘువీర్‌సింగ్‌ తన బ్యాగును చూసుకోగా అందులో ఉన్న సెల్‌ఫోన్‌ కనిపించలేదు. కాచిగూడ రైల్వే పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్‌ రైల్వే పీఎ్‌సకు బదిలీ చేసినట్లు హేడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణచారి తెలిపారు.

Updated Date - 2021-04-05T13:03:36+05:30 IST