సెలవుపై సొంతూరికి వచ్చిన బీఎస్ఎఫ్ జవాన్.. వారం రోజుల తర్వాత ఇంట్లో షాకింగ్ సీన్.. అతడిని గదిలో బంధించి..

ABN , First Publish Date - 2021-11-01T21:48:14+05:30 IST

అతడు బీఎస్‌ఎఫ్ జవాన్. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సొంతూరికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే సెలవుల మీద అతడు స్వస్థలానికి వచ్చాడు. సొంతూరికి వచ్చిన వా

సెలవుపై సొంతూరికి వచ్చిన బీఎస్ఎఫ్ జవాన్.. వారం రోజుల తర్వాత ఇంట్లో షాకింగ్ సీన్.. అతడిని గదిలో బంధించి..

ఇంటర్నెట్ డెస్క్: అతడు బీఎస్‌ఎఫ్ జవాన్. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సొంతూరికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే సెలవుల మీద అతడు స్వస్థలానికి వచ్చాడు. సొంతూరికి వచ్చిన వారం రోజులకే అతడి ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనతో ఊరిలో ఉన్న ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇంతకూ బీఎస్‌ఎఫ్ జవాన్ ఇంట్లో ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని శంషాబాద్‌ ప్రాంతంలో ఉన్న హర్హి హరిశ్చంద్ర గ్రామానికి చెందిన సత్య‌వీర్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్ జవాన్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు పది సంవత్సరాల క్రితం మీరా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురు కూడా ఉన్నారు. కాగా.. బార్డర్‌లో పని చేస్తున్న సత్యవీర్ వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు. దీంతో అతడి పిల్లలు మురిసిపోయారు. అయితే అతడు ఇంటికి వచ్చిననాటి నుంచే భార్య‌తో గొడవకు దిగడంతో ఆ చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా మద్యం సేవించి, ఇంటికి వచ్చిన అతడు అర్ధరాత్రి వాగ్వాదానికి దిగాడు. కాగా.. తెల్లారే సరికి ఇంట్లో తల్లి.. విగత జీవిగా వేలాడుతూ ఉండటాన్ని చూసి పిల్లలు భయంతో కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 



ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో పడి ఉన్న సత్యవీర్‌ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతడు వారితో వాగ్వాదానికి దిగడంతో.. మరికొంత మంది పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సత్యవీర్‌ను గదిలో బంధించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. మీరాను సత్యవీర్ చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడని.. బెల్టు కొడుతూ హింసిస్తూ ఉండేవాడని ఆమె కుటంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మీరాను సత్యవీరే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారరు. 




Updated Date - 2021-11-01T21:48:14+05:30 IST