బీఎస్ఎన్ఎల్ జీఎం కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-14T05:23:32+05:30 IST
బీఎస్ఎన్ఎల్ తిరుపతి జిల్లా జనరల్ మేనేజర్ ఎ.గోపాలకృష్ణారావు(51) కరోనాతో గురువారం మృతి చెందారు.
తిరుపతి(ఆటోనగర్), మే 13: బీఎస్ఎన్ఎల్ తిరుపతి జిల్లా జనరల్ మేనేజర్ ఎ.గోపాలకృష్ణారావు(51) కరోనాతో గురువారం మృతి చెందారు.గురువారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.వారం క్రితం కరోనా లక్షణాలు కన్పించడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు.మూడు రోజుల క్రితం ఆక్సిజన్ స్థాయులు తగ్గడంతో స్విమ్స్లో చేరిన ఆయన గురువారం తెల్లవారు జామున త్వదిశ్వాస విడిచారు.ప్రకాశం జిల్లాకు చెందిన గోపాలకృష్ణారావు 2019 సెప్టెంబరులో ప్రమోషన్పై తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ జీఎంగా బాధ్యతలు స్వీకరించారు.ఆయన మృతి పట్ల అధికారులు వెంకోబరావు, దామోదరంలతో పాటు కార్మిక సంఘాల నాయకులు వైఎస్ రాజు, సుబ్రహ్మణ్యం, గుర్రప్ప, ఎలయ్య, ప్రభాకర రెడ్డి తదితరులు ప్రగాఢసంతాపం తెలిపారు.