రూ. 147తో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

ABN , First Publish Date - 2020-08-01T23:00:29+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల

రూ. 147తో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. అలాగే, రూ. 247, రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ల కాలపరిమితిని పెంచింది. అలాగే, ఎంపిక చేసిన ప్లాన్లతో ఎరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. రూ. 78, రూ. 551, రూ. 249, రూ. 447 ప్రీపెయిడ్ ప్లాన్లను ఉపసంహరించుకుంది. అలాగే, రూ.144, రూ. 792, రూ. 1,584 పతంజలి ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. 


రూ. 147 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ 250 నిమిషాల ఎఫ్‌యూపీతో లభిస్తాయి. ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కూడా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాలపరిమితి 30 రోజులు కాగా, 10 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ‘STV COMBO147’ అని టైప్ చేసి 123కి మెసేజ్ చేయడం ద్వారా ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు.  అలాగే, రూ.247 ప్రీపెయిడ్ ప్లాన్‌ కాలపరిమితిని 36 రోజులకు, రూ.1,999 ప్లాన్‌ను రూ.439 రోజులకు పెంచింది. రూ. 247 ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లోక్‌ధున్, ఎరోస్ నౌక్ కంటెంట్ 30 రోజుల వరకు ఉచితంగా లభిస్తాయి. రూ. 429 ప్రీపెయిడ్ ప్లాన్‌లోనూ ఎరోస్ నౌ సర్వీసులు బండిల్డ్‌గా లభిస్తాయి. 

Updated Date - 2020-08-01T23:00:29+05:30 IST