మూగబోయిన బీఎస్ఎన్ఎల్ ఫోన్లు
ABN , First Publish Date - 2021-04-11T09:09:34+05:30 IST
బీఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఆ నెట్వర్క్ ఫోన్లు మూగబోయాయి. శనివారం రోజంతా బీఎస్ఎన్ఎల్ ఫ్లోన్లు ఉలుకుపలుకు
విజయవాడ/ఏలూరు ఫైర్స్టేషన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): బీఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఆ నెట్వర్క్ ఫోన్లు మూగబోయాయి. శనివారం రోజంతా బీఎస్ఎన్ఎల్ ఫ్లోన్లు ఉలుకుపలుకు లేకుండా ఉన్నాయి. గుంటూరులో ఉన్న ఎంఎ్ససీ (మొబైల్ స్విచ్చింగ్ సెంటర్)లో ఏర్పడిన సాంకేతిక సమస్య దీని కారణమని గుర్తించారు. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగుల ఫోన్లన్నీ ఒకేసారి మోగకపోవడంతో అనుమానం వచ్చింది. తర్వాత కాసేపటికి ఆ శాఖ వాట్సాప్ గ్రూపులో ఎంఎ్ససీలో సాంకేతిక సమస్య ఏర్పడిందని మెసేజ్ వచ్చింది.
ఏ సర్వీసు ప్రొవైడర్కు చెందిన సిమ్లు పనిచేయాలన్నా ఈ ఎంఎ్ససీలే కీలకం. ఇక్కడి నుంచి సిగ్నల్స్ సక్రమంగా ఉన్నప్పుడే అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్లో స్పష్టత ఉంటుంది. రాష్ట్రంలో బీఎ్సఎన్ఎల్కు చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నంలో మొబైల్ స్విచ్చింగ్ కేంద్రాలు ఉన్నాయి. గుంటూరులో ఉన్న ఎంఎ్ససీ... గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను కవర్ చేస్తుంది. ఇక్కడి సర్వర్లో సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఆ మూడు జిల్లాల్లో ఫోన్లు సాయంత్రం వరకూ పనిచేయలేదు.