నిబద్ధత కల్గిన ఉద్యమ నేత బుచ్చయ్య
ABN , First Publish Date - 2021-04-23T01:56:52+05:30 IST
నిబద్ధత కలిగిన ఉద్యమ నేత తొండెపు బుచ్చయ్య అని సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు.
సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి చిట్టిపాటి
బుచ్చయ్య అంతిమయాత్రకు తరలిన ప్రజా సంఘాల నేతలు
జాగర్లమూడి(పర్చూరు), ఏప్రిల్ 22: నిబద్ధత కలిగిన ఉద్యమ నేత తొండెపు బుచ్చయ్య అని సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. కమ్యూనిస్టు నేత తొండెపు బుచ్చయ్య అంతిమ యాత్ర యద్దనపూడి మండలం జాగర్లమూడిలో గురువారం జరిగింది. ప్రజా సంఘాలు, ఉద్యమనేతలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బుచ్చయ్య మృతదేహం వద్ద పూలమాలలు ఉంచి, విప్లవ గీతాలతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిట్టిపాటి మాట్లాడుతూ ఏడు దశాబ్దాలకు పైగా తాను నిమ్మిన సిద్దాంతాన్ని అనుసరిస్తూ పీడిత ప్రజల విముక్తికి అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా బుచ్చయ్యను కొనియాడారు. అనంతరం నల్లమడ రైతుసంఘం అధ్యక్షులు కొల్లా రాజమోమన్ మాట్లాడుతూ అతి పిన్నవయస్సులోనే ఉద్యమాల బాటలో పయనించి సుదీర్ఘకాలం హక్కుల కోసం పోరాటం చేసిన ఘనత బుచ్చయ్యకే దక్కుతుందన్నారు. అనంతరం ఆరుణోదయ నాట్యమండలి డప్పువాయిద్యాలు, విప్లవ గీతాల నడుమ అంతిమ యాత్ర సాగింది కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నెల్లూరు జిల్లా కార్యదర్శి సాగర్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, రైతుకూలీ సంఘం నాయకులు నాగయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మోహన్, నల్లమడ రైతుసంఘం నాయకులు నరిశెట్టి ఆచార్యులు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.