మున్సిపల్‌ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా సమీక్ష

ABN , First Publish Date - 2021-02-25T05:01:54+05:30 IST

రానున్న మున్సిపల్‌ ఎన్నికలపై శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరు మున్సిపా లిటీలో ఆయా వార్డుల అభ్యర్థులతో బుధవారం చర్చించారు.

మున్సిపల్‌ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా సమీక్ష

ఆత్మకూరు, ఫిబ్రవరి 24: రానున్న మున్సిపల్‌ ఎన్నికలపై శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరు మున్సిపా లిటీలో ఆయా వార్డుల అభ్యర్థులతో బుధవారం చర్చించారు. వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలోని ఆయన స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో వార్డుల వారీగా అభ్యర్థులు, వార్డు నాయకులతో చర్చించి ఎన్నికల సన్నా హం గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకంగా ఉందని, టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులకు పార్టీ అన్నివిధాలుగా సహకరి స్తోందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అహ్మద్‌హుసేన్‌, శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు శివప్రసాద్‌రెడ్డి, వరాల మాలిక్‌, గిరిరాజు, వెంకటేశ్వర్లు, శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-02-25T05:01:54+05:30 IST