అక్రమ కేసులకు భయపడేది లేదు: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-10-30T19:28:27+05:30 IST

శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై కేసులు పెట్టడం, చేతులకు బేడీలు వేయడం..

అక్రమ కేసులకు భయపడేది లేదు: బుద్దా వెంకన్న

విజయవాడ: శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై కేసులు పెట్టడం, చేతులకు బేడీలు వేయడం దారుణమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ రాజధాని కోసం చేస్తున్న అమరావతి ఉద్యమంలో అన్ని వర్గాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలడంలేదని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. రైతుల చేతులకు బేడీలు వేసి గుంటూరు జిల్లా కోర్టుకు తరలించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-10-30T19:28:27+05:30 IST