డ్రగ్స్ దందాలో విజయసాయిరెడ్డి ప్రమేయం: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-10-03T18:01:34+05:30 IST

డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని బుద్దా వెంకన్న అన్నారు.

డ్రగ్స్ దందాలో విజయసాయిరెడ్డి ప్రమేయం: బుద్దా వెంకన్న

విజయవాడ: రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తెలియవచ్చిందన్నారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్ వ్యవహారం గుట్టుమట్లు బయటపడతాయన్నారు. 


డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూ ఆక్రమణల్లో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్‌కు సహకరిస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. బిగ్ బాస్‌కు తెలియకుండా విజయసాయిరెడ్డి ఏమీ చేయరనేది వాస్తవమన్నారు. ఈ విషయం గ్రామాల్లో అరుగుల మీద కూర్చునే ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం విజయసాయి అక్రమార్జన, అవినీతి గుట్టుమట్లను చేధిస్తుందన్నారు. ఏ2 చేసిన అవినీతికి శిక్షలు వేయాలంటే రాజ్యాంగంలో ఇప్పుడున్న శిక్షలు సరిపోవని బుద్దా వెంకన్న అన్నారు.

Updated Date - 2021-10-03T18:01:34+05:30 IST