వైసీపీలోని వర్గపోరుకు అది సంకేతం: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-12-13T19:43:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందని నారాయణస్వామి వ్యాఖ్యలు...

వైసీపీలోని వర్గపోరుకు అది సంకేతం: బుద్దా వెంకన్న

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందని.. స్వయంగా నారాయణస్వామి వ్యాఖ్యలు చేయడం అనుమానం కలుగుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోని వర్గపోరుకు ఇది సంకేతమన్నారు. అధికార పార్టీలోని వారే ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్టు చేస్తారా... ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై  సీఐడీ అధికారులు పెట్టిన అక్రమ కేసును ఖండిస్తున్నామన్నారు. ఆర్కేపై కక్షసాధింపులు మాని.. సీఎం ఇంటి దొంగలపై దృష్టిపెట్టాలని బుద్దా వెంకన్న సూచించారు.


Updated Date - 2021-12-13T19:43:37+05:30 IST