కౌలురైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-04T07:07:09+05:30 IST
ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు ముళ్లపూడి వెంకట కృష్ణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు.
అవనిగడ్డ టౌన్ : ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు ముళ్లపూడి వెంకట కృష్ణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం కౌలురైతు మృతదేహానికి మండలి నివాళులర్పించారు. వెంకట కృష్ణయ్య కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందించి ధైర్యం చెప్పారు. బుద్ధప్రసాద్ తనయుడు వెంక ట్రామ్, యలవర్తి చిన్నా తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వెంకట కృష్ణయ్య కుటుంబాన్ని సీపీఎం నేతలు గురువారం పరామర్శించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వాకా రామచంద్రరావు, ఆవుల బసవయ్య, శీలం నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.