శవాలపై పేలాలేరేది జగనైతే.. వెనుక డప్పు కొట్టేది మీరే: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-03-30T19:28:37+05:30 IST

అమరావతి: కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిల్లర రాజకీయం మొదలు పెట్టారంటూ..

శవాలపై పేలాలేరేది జగనైతే.. వెనుక డప్పు కొట్టేది మీరే: బుద్దా వెంకన్న

అమరావతి: కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిల్లర రాజకీయం మొదలు పెట్టారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ గురించి విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న ప్రశ్నలతో కూడిన టెస్ట్ కూడా పెట్టారు. 


‘‘కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చిల్లర రాజకీయం మొదలుపెట్టిన విజయసాయి రెడ్డికి చిన్న నిజరోనా టెస్ట్ పెడుతున్నా. తండ్రి శవం దొరక్కముందే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసి.. సంతకాలు సేకరించి శవాలపై పేలాలు ఏరుకున్నది ఎవరు ?


పెద్ద జబ్బుతో పోయిన వాడిని.. మా నాన్న కోసం పోయాడు అంటూ ఓదార్పు పేరుతో బుగ్గలు నిమిరి సగం మందికి మాత్రమే సహాయం అందించి మిగిలిన వాళ్ళకి ఎగ్గొట్టి శవాలపై పేలాలు ఏరిన నాయకుడు ఎవరు? ఆఖరికి బాబాయ్ హత్యని కూడా రాజకీయం కోసం వాడుకొని శవాలపై పేలాలు ఏరుకున్న వారు ఎవరు? 


సాయి రెడ్డి గారు ఈ ప్రశ్నలకు సమాధానం మీ ట్విట్టర్ లో పెడతారని ఆశిస్తున్నా. శవాలపై పేలాలు ఏరే బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు అయితే.. వెనుక డప్పు కొట్టేది మీరు అని మర్చిపోతే ఎలా సాయి రెడ్డి గారు’’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.


Updated Date - 2020-03-30T19:28:37+05:30 IST