ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లు మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2021-11-23T18:31:48+05:30 IST

ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లును మండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామన్నారు

ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లు మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

అమరావతి: ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లును మండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరగడం వల్ల విభజన సమస్య వచ్చిందన్నారు. దేవుడి దయ వల్ల తెలంగాణ ఎక్కడా వెనకపడలేదన్నారు. అభివృద్ధి చెందనిది తెలంగాణ కాదని... రాయలసీమ, ఉత్తరాంధ్ర అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ వంటి కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే స్థాపించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారన్నారు. మరింత మందితో చర్చలు జరిపి అందరికీ ఆమోదంగా ఉండేలా కొత్త బిల్లు తీసుకొస్తామని బుగ్గన పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T18:31:48+05:30 IST