బుగ్గనకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-06-14T14:52:48+05:30 IST

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి..

బుగ్గనకు చేదు అనుభవం

  • వీఐపీ గేటు వద్ద అడ్డుకున్న సిబ్బంది

తిరుపతి: రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తిరుపతి పర్యటన పూర్తి చేసుకునివెళ్తున్నారు. ఆయనకు విడ్కోలు పలికేందుకు మంత్రి బుగ్గన విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో విమానాశ్రయ సిబ్బంది ఆయన్ను వీఐపీ గేట్‌ లోపలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన కేంద్ర మంత్రికి వీడ్కోలు పలకలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ‘నన్నే అడ్డుకుంటారా?’ అంటూ విమానాశ్రయ సిబ్బందితో వాదనకు దిగారు. తనను అడ్డుకున్న వారి వివరాలు వెంటనే తనకు కావాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ చొరవ తీసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

Updated Date - 2021-06-14T14:52:48+05:30 IST