బిల్డర్‌ వేధింపులు.. గృహిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-25T15:46:55+05:30 IST

బిల్డర్‌ వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు...

బిల్డర్‌ వేధింపులు.. గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌(ఆంధ్రజ్యోతి): బిల్డర్‌ వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డికి చెందిన నాగరాజు, అలేఖ్య (32) దంపతులు ఇటీవల కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధి పద్మానగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని బాగ్‌లాల్‌ రెసిడెన్సీలో ఫ్లాటును కొన్నారు. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. అలేఖ్య వస్త్ర వ్యాపారం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పులోళ్ల వేధింపులు అధికమవడంతో గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని మృతి చెందింది. సంఘటన స్థలానికి చేసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా చావుకు బిల్డర్‌ సందీప్‌, అనిలా ఆంటీ’’ అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-01-25T15:46:55+05:30 IST