అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక హత్య...నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-04T15:53:08+05:30 IST

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించిందని బాలికను హతమార్చిన కీచకుడి ఉదంతం ...

అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక హత్య...నిందితుడి అరెస్ట్

 బులంద్‌షహర్‌ (ఉత్తరప్రదేశ్): అత్యాచారం చేయబోతే ప్రతిఘటించిందని బాలికను హతమార్చిన కీచకుడి ఉదంతం బులంద్‌షహర్‌ పట్టణ సమీపంలోని సిసౌరా గ్రామంలో వెలుగుచూసింది.ఈ కేసులో నిందితుడైన హరీంద్రను సిమ్లాలో అరెస్టు చేసి విచారించడంతో ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగుచూశాయి.మంచినీళ్లు తాగేందుకు ఇంటికి వచ్చిన బాలికపై హరీంద్ర అత్యాచారం చేయబోయాడు. దీంతో బాలిక అరిచి ప్రతిఘటించింది. దీంతో హరీంద్ర బాలికను హతమార్చి గుంత తవ్వి పాతిపెట్టి సిమ్లాకు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సిమ్లాకు వచ్చి నిందితుడైన హరీంద్రను అరెస్టు చేశారు. నిందితుడు హరీంద్ర ఢిల్లీలో కార్మికుడిగా పనిచేసే వాడని, మూడు రోజుల క్రితం తన స్వస్థలమైన బులంద్ షహర్కు వచ్చి బాలికపై అత్యాచార యత్నం చేయగా, ప్రతిఘటించిందని చంపేశాడని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-03-04T15:53:08+05:30 IST