రూ.కోటి ఎద్దు.. ఒక డోసు వీర్యం రూ.వెయ్యి

ABN , First Publish Date - 2021-11-15T20:04:52+05:30 IST

ఒంగోలు గిత్తల గురించి మనకు బాగా తెలిసే ఉంటుంది. ఆకారంలో, బలంలో దిట్టంగా ఉండే ఆ ఎద్దుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఒంగోలు గిత్తను మించిన ఒక ఎద్దు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ‘కృషి మేళా’లో రికార్డు ధరకు అమ్ముడు పోయింది. క్రిష్ణ అనే పేరు గల ఈ ఎద్దు కోటి రూపాయలకు అమ్ముడుపోయింది..

రూ.కోటి ఎద్దు.. ఒక డోసు వీర్యం రూ.వెయ్యి

బెంగళూరు: ఒంగోలు గిత్తల గురించి మనకు బాగా తెలిసే ఉంటుంది. ఆకారంలో, బలంలో దిట్టంగా ఉండే ఆ ఎద్దుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఒంగోలు గిత్తను మించిన ఒక ఎద్దు కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ‘కృషి మేళా’లో రికార్డు ధరకు అమ్ముడు పోయింది. క్రిష్ణ అనే పేరు గల ఈ ఎద్దు కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. మూడున్నరేళ్ల వయసున్న ఈ ఎద్దు వీర్యం కూడా అంతే స్థాయిలో ఖరీదు పలుకుతోంది. ఒక డోసు వీర్యం ధర వెయ్యి రూపాయాలకు అమ్ముతున్నారట. ఇది హల్లికర్ జాతికి చెందినదని, హల్లికర్ జాతి అన్ని పశువులకు ఇది మూలమని యమజాని బోరగౌడ తెలిపారు. ఈ యేడాది నిర్వహించిన కృషి మేళాకు 12,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. 550 వ్యవసాయ స్టాల్స్‌లో సంప్రదాయ, హైబ్రిడ్‌కు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పశువులు, పౌల్ట్రీ ఉత్పత్తులను ఈ మేళాలో ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-11-15T20:04:52+05:30 IST