బుల్లెట్ బండిపై మట్టి గణపయ్య
ABN , First Publish Date - 2021-09-12T00:03:32+05:30 IST
‘బుల్లెట్టు బండి’ పాట ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఆ ట్రెండ్ ఎంతలా మారిందంటే ఏకంగా బుల్లెట్పై వినాయకుడు కూర్చున్న
అశ్వారావుపేట: ‘బుల్లెట్టు బండి’ పాట ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఆ ట్రెండ్ ఎంతలా మారిందంటే ఏకంగా బుల్లెట్పై వినాయకుడు కూర్చున్న ప్రతిమను భక్తుల ఆవిష్కరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కొందరు ఔత్సాహికులు వివిధ రకాల ఆకృతుల్లో వినాయకుడి ప్రతిమలు తయారు చేసి పూజించడం ఏటా చూస్తూనే ఉంటాం.. అదే తరహాల్లో ఇటీవల ‘బుల్లెట్టు బండి’ పాట బహుళ ప్రాచూర్యం పొందిన నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో కొందరు చిన్నారులు బుల్లెట్ బండిపై గణనాధుడు కూర్చున్నట్లుగా మట్టితో స్వయంగా విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని వినాయకచవితి రోజు ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాన్ని గ్రామస్థులు అభినందించారు.