రేపు ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్?
ABN , First Publish Date - 2020-12-05T20:00:02+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు బండి సంజయ్ వివరించనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీ సహా పలువును కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.