కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

ABN , First Publish Date - 2021-10-28T20:31:14+05:30 IST

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం రాసిన

కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం రాసిన లేఖను సాయంత్రం 5 గంటల లోపు బహిర్గతం చేయాలని, లేకుంటే కేసీఆర్ రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ లేఖ రాస్తే.. కేంద్రాన్ని తాము ఒప్పిస్తామని చెప్పారు. రైతుల పాలిట కేసీఆర్ రాబందుగా మారారని ద్వజమెత్తారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై చర్యలకు ఈసీని కోరతామని తెలిపారు. కోర్టులను ధిక్కరించే వ్యాఖ్యలు చేసిన కలెక్టర్‌పై న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో పండిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వరి కాకుండా ఏ పంట పండించాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదని తప్పుబట్టారు. వరి పంట వేయకుంటే లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజక్ట్ ఎందుకు? అని ప్రశ్నించారు. రైతుబందు ఇచ్చి.. కేసీఆర్ అన్నీ బంద్ చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-28T20:31:14+05:30 IST