కడప రిమ్స్లో మృతదేహాల కలకలం
ABN , First Publish Date - 2021-05-09T09:15:31+05:30 IST
కడప రిమ్స్లో భారీగా మృత దేహాలుండటం కలకలం రేపుతోంది. రిమ్స్ మార్చురీలో భారీగా మృతదేహాలున్నట్లు సమాచారం రావడంతో శనివారం మీడి యా వచ్చి పరిశీలించగా, 13 మృతదేహాలు కనిపించాయి
కడప, మే 8(ఆంధ్రజ్యోతి): కడప రిమ్స్లో భారీగా మృత దేహాలుండటం కలకలం రేపుతోంది. రిమ్స్ మార్చురీలో భారీగా మృతదేహాలున్నట్లు సమాచారం రావడంతో శనివారం మీడి యా వచ్చి పరిశీలించగా, 13 మృతదేహాలు కనిపించాయి. వాటికి కొవిడ్ ప్రొటోకాల్ మేరకు ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంచారు. అయితే, గత రెండురోజులుగా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో కరోనా మరణాల వివరాలు వెల్లడించలేదు.