భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం

ABN , First Publish Date - 2021-01-14T05:40:45+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను బోగి మంట ల్లో దహనం చేసి నిరసన తెలిపారు.

భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం
మునిపంపులలో ప్రతులను దహనం చేస్తున్న సీపీఎం కార్యకర్తలు

భువనగిరి రూరల్‌/ ఆలేరు/ రామననపేట, జనవరి 13: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల  ప్రతులను బోగి మంట ల్లో దహనం చేసి నిరసన తెలిపారు.  భువనగిరి, ఆలేరు, రామన్నపేట మండలంలోని మునిపంపులో కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, విద్యుత్‌బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దాసరిపాండు, అనురాధ, బొడ్డుపల్లి వెంకటేశం, మంగ నర్సింహులు, రాచకొండ జనార్ధన్‌, జితేందర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-14T05:40:45+05:30 IST