బాన్సువాడ నుంచి జేబీఎస్కు బస్సు సర్వీసు
ABN , First Publish Date - 2021-05-17T05:05:44+05:30 IST
లాక్డౌన్ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి జెబీఎస్ వరకు బస్సు సర్వీసు నడుపుతున్నట్లు ఇన్చార్జి ఆర్టీసీ డీఎం రమణ తెలిపారు.
బాన్సువాడ టౌన్, మే 16: లాక్డౌన్ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి జెబీఎస్ వరకు బస్సు సర్వీసు నడుపుతున్నట్లు ఇన్చార్జి ఆర్టీసీ డీఎం రమణ తెలిపారు. బస్సు ఉదయం 5 గంటలకు బాన్సువాడ బస్టాండ్ నుంచి కామారెడ్డి మీదుగా జేబీఎస్కు చేరుకుంటుందన్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల నుండి జేబీఎస్ నుంచి బాన్సువాడ చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా బాన్సువాడ నుంచి నిజామాబాద్కు ఉదయం 6 గంటలకు, 6.30 గంటలకు రెండు బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.