మిధాని వ్యాపార వృద్ధి 19 శాతం
ABN , First Publish Date - 2020-07-02T06:08:57+05:30 IST
కేంద్ర రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) 2019-20ఆర్థిక సంవత్సరంలో రూ.970.11 కోట్ల వ్యాపారం సాధించింది.
చంపాపేట (ఆంధ్రజ్యోతి): కేంద్ర రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) 2019-20ఆర్థిక సంవత్సరంలో రూ.970.11 కోట్ల వ్యాపారం సాధించింది. 2018-19లో సాధించిన వ్యాపారం కన్నా ఇది 19.06 శాతం అధికం. గత ఏడాదికి ఒక్కో షేరుపై ఒక రూపాయి మధ్యంతర డివిడెండును ప్రకటించింది.