మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2020-04-09T10:54:40+05:30 IST

రైతులు పండించిన పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ కుమార్‌


అక్కన్నపేట/కోహెడ, ఏప్రిల్‌ 8 : రైతులు పండించిన పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిషత్‌, కోహెడ జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో ధాన్యం కొనుగోళ్లతో పాటు కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జడ్పీవైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, హుస్నాబాద్‌ ఆర్టీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీటీసీ స్వరూప, ఎంపీపీ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-09T10:54:40+05:30 IST