ఉప ఎన్నిక హామీలు నెరవేరుస్తాం

ABN , First Publish Date - 2021-07-30T06:03:12+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

ఉప ఎన్నిక హామీలు నెరవేరుస్తాం
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

మంత్రి జగదీష్‌రెడ్డి 

హాలియాలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

హాలియా, జూలై 29: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సాగర్‌ నియోజకవర్గం హాలియాలో ఆగస్టు 2న సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి జగదీ్‌షరెడ్డి గురువారం పరిశీలించారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద హెలీప్యాడ్‌, నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశం ఐటీఐ కళాశాల భవనాలు, మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ పలు హామీలు ఇచ్చారన్నారు. వాటి అమలు, నియోజకవర్గ ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రగతి, దీర్ఘకాలిక సమస్యలపై వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ, అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేస్తారన్నారు. మంత్రి వెంట కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, ఎస్పీ ఏవీ.రంగనాథ్‌, ఎమ్మెల్యేలు నోముల భగత్‌, గాదరి కిషోర్‌, ఆర్డీవో రోహిత్‌సింగ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, ఎంసీ.కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-30T06:03:12+05:30 IST