బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-01-26T05:59:01+05:30 IST

బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలి

బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

తాండూరు: బై పాస్‌ రోడ్డు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయ ంత్రం క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో అశోక్‌కుమార్‌, రేంజ్‌ అధికారి శ్యాంసుందర్‌రావు, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. తట్టేపల్లి రోడ్డుకు అడ్డంకిగా మారిన అటవీ భూములపై జిల్లా అటవీ శాఖ అధికారులతో సమీక్షించి సమస్య పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మురళికృష్ణాగౌడ్‌, నర్సిరెడ్డి, నర్సింహులు, కాంట్రాక్టర్‌ హర్షవర్దన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ  పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T05:59:01+05:30 IST