283వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు
ABN , First Publish Date - 2020-09-26T08:57:26+05:30 IST
తల్లి లాంటి అమరావతిని విస్మరిస్తే పుట్టగతులుండవని రాజధాని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వారు చేస్తున్న ఉద్య
తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి క్రైమ్, తాడికొండ, సెప్టెంబరు 25 : తల్లి లాంటి అమరావతిని విస్మరిస్తే పుట్టగతులుండవని రాజధాని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వారు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 283వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం బోరుపాలెం, ఐనవోలు, నేలపాడు, రాయపూడి, వెలగపూడి, మందడం, ఉద్దండ్రాయునిపాలెం తదితర రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రులకు తల్లి లాంటి అమరావతిని మంత్రులు, ఎమ్మెల్యేలు అవహేళన చేస్తున్నారన్నారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఏమిటో చెప్పకుండా బిల్లులు తీసుకొచ్చారన్నారు. అభివృద్ధి చేయాలనుకుంటే సీఆర్డీఏ రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి.