డీఎంహెచ్‌వోగా సుహాసిని

ABN , First Publish Date - 2020-09-26T08:59:34+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణిగా డాక్టర్‌ మాచెర్ల సహాసినిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గొల్లపూడిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ

డీఎంహెచ్‌వోగా సుహాసిని

డీఎంహెచ్‌వోగా సుహాసిని 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణిగా డాక్టర్‌ మాచెర్ల సహాసినిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గొల్లపూడిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ విభాగానికి ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ సుహాసినిని జిల్లా డీఎంహెచ్‌వోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.


ఇంతకుముందు డీఎంహెచ్‌వోగా పని చేసిన డాక్టర్‌ ఐ.రమేష్‌ ఆగస్టు 31న పదవీ విరమణ చేయడంతో డాక్టర్‌ టీవీఎస్‌ఎన్‌ శాస్త్రికి డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆ స్థానంలో డాక్టర్‌ సుహాసినిని నియమించారు. నేడో, రేపో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Updated Date - 2020-09-26T08:59:34+05:30 IST