333 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-28T10:56:39+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 333 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు బాధితులు మరణించారు.

333 మందికి కరోనా

 (ఆంధ్రజ్యోతి, విజయవాడ) :

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 333 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు బాధితులు మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో  కరోనా పాజిటివ్‌ కేసులు 26,487కు చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 430కు పెరిగాయి. గడచిన 24 గంటల్లో 398 మంది వ్యాధి నుంచి కోలుకోగా, ప్రస్తుతం 2,804 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇంకా వేల మంది పాజిటివ్‌ బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

మరో ఐదు కంటైన్మెంట్‌ జోన్లు

జిల్ల్లాలో కొత్తగా మరో ఐదు కంటైన్మెంట్‌ జోన్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం ప్రకటించారు. చాట్రాయి మండలంలోని సోమవరం గ్రామం, మచిలీపట్నం మండలంలోని వర్రెగూడెం, పమిడిముక్కల మండలం గోపువానిపాలెం, విజయవాడ రూరల్లో నైనవరం, ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామాల్లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్‌ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 527 కంటైన్మెంట్‌ జోన్లలో 2804 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు.

Updated Date - 2020-09-28T10:56:39+05:30 IST