భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తిచేయాలి : జేసీ

ABN , First Publish Date - 2020-09-28T10:58:13+05:30 IST

భూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని జేసీ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు.

భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తిచేయాలి : జేసీ

విజయవాడ సిటీ : భూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని జేసీ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రైస్‌కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలతో ఆదివారం ఆమె సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ నివేశన స్థలాల పంపిణీకి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.


దీనికోసం జిల్లాలో అన్ని భూ రికార్డుల స్వచ్ఛీకరణ  కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. అర్హులైన పేదలందరికీ రైస్‌ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో సబ్‌ కలెక్టర్లు హెచ్‌ఎం ధ్యానచంద్ర, ప్రతిష్ట మంగైన్‌, ఆర్డీవోలు ఖాజావలి, జి.శ్రీనివాసకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-28T10:58:13+05:30 IST