రూ.11,040 కోట్లతో జాతీయ మిషన్‌గా పామాయిల్ సేద్యం

ABN , First Publish Date - 2021-08-19T01:36:14+05:30 IST

రాబోయే ఐదేళ్లలో పామాయిల్ సేద్యాన్ని వృద్ధి చేసేందుకు రూ.11,041 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ ..

రూ.11,040 కోట్లతో జాతీయ మిషన్‌గా పామాయిల్ సేద్యం

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో పామాయిల్ సేద్యాన్ని వృద్ధి చేసేందుకు రూ.11,041 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ (ఎన్ఎంఈఓ-ఓపీ)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా వంటనూనెల దిగుమతలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌ను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఎన్ఎంఈఓ-ఓపీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతున్నందున దేశీయంగా ఆయిల్ ఉత్పత్తులను పెంచాల్సి ఉంటుందని, సాగు విస్తీర్ణం పెంచడం, ఉత్పత్తి పెంచడం ఇందులో కీలకమవుతాయని చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఆయిల్ పామ్ పెంపకందారులకు ధర హామీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్లాంటింగ్ మెటీరియల్ కోసం హెక్టారుకు ఇచ్చే రూ.12,000 సాయాన్ని రూ.29,000కు రెట్టింపు చేస్తామని తోమర్ తెలిపారు.

Updated Date - 2021-08-19T01:36:14+05:30 IST