బంధువును హత్య చేసి శరీరాన్ని ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2020-06-02T21:35:24+05:30 IST

అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది.

బంధువును హత్య చేసి శరీరాన్ని ఏం చేశాడంటే..

రిచ్‌మాండ్ రెసిడెన్స్: అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి బంధువును హత్య చేయడమే కాకుండా ఆమె శవాన్ని తింటూ కనిపించాడు. కాలిఫోర్నియాలోని రిచ్‌మాండ్ రెసిడెన్స్‌కు చెందిన నిందితుడిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తాము నిందితుడి ఇంటికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన సమయంలో.. నిందితుడు శవాన్ని తింటూ కనిపించినట్టు పోలీసులు చెప్పారు. నిందితుడిపై హత్యకేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా.. నిందితుడి పేరు కాని, చనిపోయిన మహిళ పేరు కాని పోలీసులు వెల్లడించలేదు. నిందితుడు ఏ కారణంగా హత్య చేశాడన్న విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - 2020-06-02T21:35:24+05:30 IST