బంద్‌ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-03-03T06:46:15+05:30 IST

ప్రజాసంఘాలు, వామపక్షాల పిలుపు మేరకు ఈ నెల ఐదున జరగనున్న బందును గుడ్లూరులో విజయవంతం చేయాలని, సీపీఎం మండల నాయకులు మంగళవారం తెలిపారు.

బంద్‌ను జయప్రదం చేయండి

 గుడ్లూరు, మార్చి 2 : ప్రజాసంఘాలు, వామపక్షాల పిలుపు మేరకు ఈ నెల ఐదున జరగనున్న బందును గుడ్లూరులో విజయవంతం చేయాలని, సీపీఎం మండల నాయకులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గుడ్లూరు సీపీఎం ప్రాంతీయకమిటీ కార్యాలయంలో బందు నిర్వహణపై ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కంటెనపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అనాడు విశాఖ ఉక్కును సాధించుకోవడానికి 32 మంది అమర వీరులు, తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ‘విశాఖ ఉక్కు - ఆంద్రుల హక్కుగా’ ఏర్పాటైయిందన్నారు. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేట్‌ పరం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దీన్ని ఎదుర్కొంనేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.  కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దామా కృష్ణయ్య మద్దిశెట్టి జాలయ్య, కోమరగిరి అంజయ్య, మాలకొండయ్య, కోరిశపాటి రమణారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T06:46:15+05:30 IST